వీసా,గుర్తింపు కార్డు నిబంధనలను సవరించిన యూఏఈ
- July 11, 2020
యూఏఈ:గుర్తింపు కార్డుల జారీ, జాతీయత రంగాలకు సంబంధించిన నిబంధనల్లో అనేక సవరణలకు యూఏఈ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో పాత నిబంధనల మేరకు ప్రవాసీయులకు నివాస అనుమతులు, వీసాల జారీ, ఎంట్రీ పర్మిట్లు, గుర్తింపు కార్డుల జారీ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అంటే పాత నిబంధనల ప్రకారం ఇక వీసాలు, గుర్తింపు కార్డుల జారీ ఉండదు. ఇక జులై 12 నుంచి కొత్త నిబంధనల మేరకు బకాయి ఫీజులను వసూలు చేస్తూ సేవలను కొనసాగించనున్నారు. ఈ బాధ్యతను ఐడెంటిటీ, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి చేసిన సవరణల ప్రకారం..ఎమిరాతీలు, జీసీసీ దేశాల పౌరులు, దేశంలో ఉన్న నివాసితులు తమ డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇక దేశంలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నెల రోజుల్లోగా ఎమిరాతిలు, జీసీసీ దేశాల పౌరులు, నివాసితులు(విదేశాల్లో 6 నెలల కంటే తక్కువ కాలం ఉన్నవారు) తమ డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మార్చి 1 నాటికే రెసిడెన్సీ వీసా గడువు ముగిసి ఇంకా విదేశాల్లోనే ఉన్న వారు, విదేశాల్లోనే ఆరు నెలలకు మించి ఉన్న వారికి డాక్యుమెంట్ల రెన్యూవల్ లో కొంత ఊరట కల్పించింది. వారు ఉంటున్న దేశం నుంచి యూఏఈకి విమాన సర్వీసులు ప్రారంభం అయిన నాటి నుంచి నిర్ణీత కాలంలోగా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే..ఈ నిర్ణీత కాలం ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. పైన పేర్కొన్న గ్రేస్ పిరియడ్ లోపు సేవలు పొందెందుకు ఎలాంటి జరిమానాలు ఉండవు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఫైన్ విధిస్తారు. అయితే..మిగిలిన సేవలకు మాత్రం అడ్మినిస్ట్రేటీవ్ ఫీజులు, ఫైన్లు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







