పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన : బెంగళూరు

- February 03, 2016 , by Maagulf
పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన : బెంగళూరు

సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి బెంగుళూరు నగరంలో జరిగింది. ఓ రోడ్డు ప్రమాదానికి వారే కారణమని భావించిన ఓ ముఠా.. పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బెంగళూరు నగరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 యేళ్ల మహిళ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలియదు. వారికోసం మృతురాలి బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసమయంలోనే టాంజానియా దేశానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com