పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన : బెంగళూరు
- February 03, 2016సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి బెంగుళూరు నగరంలో జరిగింది. ఓ రోడ్డు ప్రమాదానికి వారే కారణమని భావించిన ఓ ముఠా.. పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బెంగళూరు నగరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 యేళ్ల మహిళ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలియదు. వారికోసం మృతురాలి బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసమయంలోనే టాంజానియా దేశానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి