ఏపీలో కొత్తగా 1914 కరోనా పాజిటివ్ కేసులు
- July 12, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 18 మంది, విదేశాల నుంచి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 846 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం15,412 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు.. చిత్తూరు,నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 19 మంది మరణించారు. ఇప్పటి వరకు ఏపీలో 328 మంది కరోనా వైరస్ సోకి మృతిచెందారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 17,624 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటివరకు 11,53,849 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









