ఏపీలో కొత్తగా 1914 కరోనా పాజిటివ్ కేసులు
- July 12, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 18 మంది, విదేశాల నుంచి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 846 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం15,412 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు.. చిత్తూరు,నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 19 మంది మరణించారు. ఇప్పటి వరకు ఏపీలో 328 మంది కరోనా వైరస్ సోకి మృతిచెందారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 17,624 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటివరకు 11,53,849 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన