హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు
- July 13, 2020
హైదరాబాద్:కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదవుతూ వచ్చాయి.అయితే, రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.కేసులు తగ్గుముఖం పడుతున్నా,తీవ్రత నగరంలో ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖాధికారులు నగరంపై దృష్టి పెట్టారు.500 కేసుల కంటే అధికంగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.నగరంలో ఇలాంటి హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.యూసఫ్ గూడ, అంబర్ పేట, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు.ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు GHMC రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







