హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు
- July 13, 2020
హైదరాబాద్:కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదవుతూ వచ్చాయి.అయితే, రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.కేసులు తగ్గుముఖం పడుతున్నా,తీవ్రత నగరంలో ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖాధికారులు నగరంపై దృష్టి పెట్టారు.500 కేసుల కంటే అధికంగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.నగరంలో ఇలాంటి హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.యూసఫ్ గూడ, అంబర్ పేట, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు.ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు GHMC రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!









