బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి.. 400 కుటుంబాలకు సాయం
- July 13, 2020
ముంబై:బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకునే సమయంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులను ఇప్పటికే ఈ విషయమై సంప్రదించారు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోనూ సోమవారం ప్రకటించారు. కాగా, సోనూ లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రత్యేకంగా బస్సులను, చార్టెడ్ ప్లైట్ లను ఏర్పాటు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తాజా వార్తలు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!









