యూఏఈలోని విజిట్ విసాదారులకు నెల రోజుల డెడ్ లైన్..
- July 14, 2020
యూఏఈ:విజిట్ వీసాపై యూఏఈలో ఉన్న పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నెల రోజుల్లోగా విజిట్ విసాను రెన్యూవల్ చేసుకోవాల్సిందేనని డెడ్ లైన్ విధించింది. లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. ఈ నెల 12 నుంచి వీసాలు, గుర్తింపు కార్డులు, నివాస అనుమతుల విషయంలో కొత్త విధివిధానలను అమలులోకి వచ్చిన నేపథ్యంలో యూఏఈ ఈ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల వీసాలు, నివాస అనుమతులను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే..ఇటీవలె సమావేశమైన యూఏఈ మంత్రిమండలి..వీసా గడువుల విషయంలో ఇచ్చిన మినహాయింపులన్నింటిని ఉపసంహరించుకుంది. దీంతో జులై 11 నాటికి వీసాలు, నివాస అనుమతులపై అన్ని రకాల మినహాయింపులు రద్దయిపోయాయి. అయితే..ఇప్పటికే దేశంలో ఉన్న ప్రవాసీయులకు మాత్రం డాక్యుమెంట్ల రెన్యూవల్ కు మూడు నెలల మినహాయింపు ఇచ్చింది. అలాగే లాక్ డౌన్ తో విదేశాల్లోనే చిక్కుకుపోయిన నివాసితులు..యూఏఈకి వచ్చిన నాటి నుంచి నెల రోజుల్లోగా నివాస అనుమతులను రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







