మస్కట్:అవసరమైన కుటుంబాలకు పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీల ఏర్పాటు
- July 14, 2020
మస్కట్:ఓమన్ లో అర్హులైన కుటుంబాలకు ఉచితంగా ఏసీలను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ నియంత్రణ అథారిటీ ఆధ్వర్యంలో ఓమన్ ఎన్విరాన్వెమెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ దర్ అల్ అట్టా అనే స్వచ్ఛంద సంస్థ పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీలను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. సమాజానికి తోడ్పాటుగా ఉండటం తాము బాధ్యతగా భావిస్తున్నామని విద్యుత్ నియంత్రణ అథారిటీ వెల్లడించింది. అయితే..కొత్త ఏసీల ఏర్పాటు విషయంలో దార్ అల్ అట్టా సంస్థ కొన్ని విధివిధానాలను రూపొందించుకొని ఆ మేరకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం పదేళ్లకు మించి పాతబడిన ఏసీల స్థానంలో మాత్రమే కొత్త ఏసీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. పాత ఏసీల కారణంగా ఆయా కుటుంబాలకు విద్యుత్ వినియోగం పెరుగుతోందని, వాటి స్థానంలో కొత్త ఏసీలను ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







