ట్యాక్సీ ధరల పెంపుపై వ్యతిరేకత
- February 04, 2016
ట్యాక్సీ టారిఫ్ పెంపుపై లోకల్ ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమల్ అహ్మద్ ఇటీవలే టారిఫ్ పెంపుపై సంకేతాలు ఇచ్చారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా టారిఫ్లను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, ప్యాసెంజర్లు కూడా ఇదే మాట చెప్తున్నారన్న క్యాబ్ డ్రైవర్లు ఇంకా టారిఫ్ పెంచితే ట్యాక్సీ డ్రైవర్లు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. బహ్రెయినీ టాక్సీ పేరుతో లోకల్ ట్యాక్సీ డ్రైవర్లు సోషల్ మీడియాలో ఓ పేజ్ క్రియేట్ చేసి, దాని ద్వారా వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. సామాన్యులు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నారనీ, ట్యాక్సీని లగ్జరీగా భావించి దూరమయ్యే అవకాశం ఉందని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తన ఆవేదనను తీసుకెళ్ళాడు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







