భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్ఇండియా..
- February 04, 2016
భారత విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తమ ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తోంది. ఎయిర్ఇండియా మెనూలో లంచ్, డిన్నర్ తాలి(అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనం)ను చేర్చింది. వీటితో పాటు మసాలాటీనీ అందించబోతోంది. మధ్యాహ్నభోజనం, డిన్నర్ తాలి, మసాలా టీలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ఇండియా గుర్తింపు పొందనుంది. ఈ సోమవారం నుంచి ఈ సేవలను ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ విమానాల్లో ఈ సేవలు అందిస్తున్నామని.. త్వరలో ఇతర మెట్రో సెక్టార్ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









