ఒమన్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
- July 26, 2020
మస్కట్:ఒమన్లో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.శనివారం ఒక్కరోజే ఒమన్లో 1,067 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒమన్-959 పౌరులుంటే.. మిగతా విదేశీయులు-108 ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 74,858కు చేరింది. అయితే, నిన్న ఒకేరోజు 1,054 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం ఊరటనిచ్చే విషయం.
దీంతో ఇప్పటివరకు ఒమన్ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రికవరీలు 54,061కు చేరాయి.శనివారం సంభవించిన 12 మరణాలతో కలిపి ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కాటుకు బలైన వారు 371 మంది అయ్యారు. మరోవైపు ఒమన్ ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. ఒమాన్ లో కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యటానికి నిన్నటి నుండి లాక్ డౌన్ అమలు చేసారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







