ఒమన్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
- July 26, 2020
మస్కట్:ఒమన్లో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.శనివారం ఒక్కరోజే ఒమన్లో 1,067 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒమన్-959 పౌరులుంటే.. మిగతా విదేశీయులు-108 ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 74,858కు చేరింది. అయితే, నిన్న ఒకేరోజు 1,054 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం ఊరటనిచ్చే విషయం.
దీంతో ఇప్పటివరకు ఒమన్ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రికవరీలు 54,061కు చేరాయి.శనివారం సంభవించిన 12 మరణాలతో కలిపి ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కాటుకు బలైన వారు 371 మంది అయ్యారు. మరోవైపు ఒమన్ ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. ఒమాన్ లో కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యటానికి నిన్నటి నుండి లాక్ డౌన్ అమలు చేసారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







