తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్‌ కేసులు

- July 26, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా  1,593 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 1,593 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరింది.తాజాగా... 8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 463కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.3 శాతంగా ఉందన్న ప్రభుత్వం తెలంగాణలో అది 0.86 గా ఉందని తెలిపింది. తాజాగా కరోనా నుంచి 998 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసులు 41,332 గా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 1,2264 గా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా గత 24 గంటల్లో GHMC-641 పాజిటివ్ కేసులు రంగారెడ్డి-171, ఆదిలాబాద్‌-14, భద్రాద్రి కొత్తగూడెం-17, జనగాం-21, కామారెడ్డి-36, కరీంనగర్-51, ఖమ్మం-18, మహబూబ్ నగర్- 38, మహబూబాబాద్-29, మంచిర్యాల-27, మెదక్-21, మేడ్చల్, మల్కాజిగిరి-91, నాగర్ కర్నూల్- 46, నిజామాబాద్-32, పెద్దపల్లి-16, సంగారెడ్డి-61, సూర్యాపేట-22, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి జిల్లా-11 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com