యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా
- July 26, 2020
యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం నెలరోజుల ముందే అక్కడికి వెళ్తాము అని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) బాట్స్మెన్ సురేష్ రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఐసీసీ 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇక యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ పై సురేష్ రైనా మాట్లాడుతూ... నేను 2014 లో అక్కడ ఆడిన అనుభవంతో చెప్తున్నా..యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడి లాగా ప్రతి మ్యాచ్ కు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందదు. కేవలం మూడు స్టేడియాల్లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతాయి. కాబట్టి ఒక్క స్టేడియం నుండి మరొకదానికి బస్సు లోనే వెళ్లడం. అందువల్ల ఆటగాళ్లు అలసిపోరు. ఇక మేము నెల ముందు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి పరిస్థితులను, వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని తెలిపాడు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







