యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా
- July 26, 2020
యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం నెలరోజుల ముందే అక్కడికి వెళ్తాము అని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) బాట్స్మెన్ సురేష్ రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఐసీసీ 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇక యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ పై సురేష్ రైనా మాట్లాడుతూ... నేను 2014 లో అక్కడ ఆడిన అనుభవంతో చెప్తున్నా..యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడి లాగా ప్రతి మ్యాచ్ కు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందదు. కేవలం మూడు స్టేడియాల్లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతాయి. కాబట్టి ఒక్క స్టేడియం నుండి మరొకదానికి బస్సు లోనే వెళ్లడం. అందువల్ల ఆటగాళ్లు అలసిపోరు. ఇక మేము నెల ముందు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి పరిస్థితులను, వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని తెలిపాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు