యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా
- July 26, 2020
యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం నెలరోజుల ముందే అక్కడికి వెళ్తాము అని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) బాట్స్మెన్ సురేష్ రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఐసీసీ 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇక యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ పై సురేష్ రైనా మాట్లాడుతూ... నేను 2014 లో అక్కడ ఆడిన అనుభవంతో చెప్తున్నా..యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడి లాగా ప్రతి మ్యాచ్ కు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందదు. కేవలం మూడు స్టేడియాల్లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతాయి. కాబట్టి ఒక్క స్టేడియం నుండి మరొకదానికి బస్సు లోనే వెళ్లడం. అందువల్ల ఆటగాళ్లు అలసిపోరు. ఇక మేము నెల ముందు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి పరిస్థితులను, వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని తెలిపాడు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







