దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ పనివేళలు
- July 27, 2020
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్లోనూ తెరిచే వుంటుందని కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి చెప్పారు. జులై 19, ఆదివారం దుబాయ్లోని కాన్సులేట్ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ డిప్లమాట్, ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారాయన. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సెలవు రోజుల్లోనూ కాన్సులేట్ తెరిచే వుంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యసవర పరిస్థితుల్లో కాన్సుల్ సర్వీసులు ఈ రోజుల్లో కూడా అందుబాటులో వుంటాయి. రానున్న రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీ కై అనగా పాస్పోర్ట్, ఇమేజ్ర్న్సీ పత్రాలు, వీసాలకై కాన్సులేట్ కి వచ్చేవారు 24*7 హెల్ప్ లైన్ నుంబర్లకు కాల్ చేసి రావలసిందిగా తద్వారా పనులు ఆలస్యమవ్వకుండా సాఫీగా జరిగేందుకు దోహదపడుతుందని సూచించారు అమన్ పూరి.
పాస్పోర్ట్ రెన్యువల్ కు https://embassy.passportindia.gov.in/ లోని ఆన్లైన్ దరఖాస్తును నింపాలి.
ఎమెజెన్సీ నంబర్లు:
056 – 5463903 (24*7)
054 – 3090575 / 054 – 3090571 / 054 – 3090572 (ఉ 8 గం.ల నుండి రా 8 గం.ల వరకు..అన్ని రోజులు పనిచేయబడును)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష