కరోనా నెగటివ్..హాస్పిటల్ నుంచి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య డిశ్ఛార్జ్
- July 27, 2020
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం తమ నివాసానికి క్షేమంగా చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఈ తల్లీకూతురు ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తమ జల్సా భవనానికి వెళ్లారు. కోవిడ్19 రిపోర్టులు పరిశీలించిన నానావతి హాస్పిటల్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం వీరిని డిశ్ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు వారాల కిందట బిగ్ బి అమితాబ్తో పాటు అభిషేక్ వచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. జులై 11న అమితాబ్, అభిషేక్లకు కరోనా పాజిటివ్గా తేలగా.. మరుసటి రోజు వచ్చిన కోవిడ్19 ఫలితాలలో జయాబచ్చన్కు నెగటివ్, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్గా నిర్ధారించారు. కొన్ని రోజులు ఇంట్లో హోం క్వారంటైన్లో ఉన్న ఐష్, ఆరాధ్యలకు లక్షణాలు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో వారం కిందట అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







