భారత్‌లో కొత్తగా 48,513 కరోనా పాజిటివ్‌ కేసులు

- July 29, 2020 , by Maagulf
భారత్‌లో కొత్తగా 48,513 కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 15 లక్షల 31 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,513 కేసులు నమోదు కాగా, 768 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 35,286 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 15,31,669 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,09,447 ఉండగా, 9,88,029 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 34,19 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశంలో 64.51 శాతానికి పెరిగిన కరోనా రోగుల రికవరీ రేటు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com