ఆగస్టు 31 వరకూ భారత్లో అంతర్జాతీయ వాణిజ్య విమానాల రద్దు-DGCA
- July 31, 2020
న్యూ ఢిల్లీ:ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలను భారత్ నిషేధించింది. COVID-19 మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి దేశం ఈ విమాన కార్యకలాపాలను నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు, అలాగే DGCA ఆమోదించిన విమానాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ నిషేధం వర్తించదని DGCA వెల్లడించింది. మార్చి 23 నుండి షెడ్యూల్ చేయబడిన వాణిజ్య విమానాలను నిషేధించగా, స్వదేశానికి తిరిగి వచ్చే విమానాల ప్రయాణాన్ని భారతదేశం అనుమతించింది. అలాగే గమ్యస్థాన దేశాల అవసరాలను తీర్చిన వారికి రవాణా విమానాల ద్వారా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు, భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఉద్దేశించిన వందే భారత్ మిషన్ కింద, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు 2,67,436 మంది ప్రయాణికులను చేర్చాయి మరియు ఇతర చార్టర్లు మే 6 నుండి జూలై 30 వరకు 4,86,811 మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాయి.
అయితే అదనంగా, భారతదేశం ఇప్పటికే యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ మరియు కువైట్లతో రవాణా ఒప్పందాలపై సంతకం చేసింది. వివిధ దేశాల నుండి ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి మరిన్ని రవాణా ఒప్పందాలు చేసుకునే పనిలో పడ్డాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







