తెలంగాణలో కొత్తగా 1,819 కరోనా పాజిటివ్ కేసులు

- August 02, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,819 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 1,819 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 517 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 66,677కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 47,590 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 18,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా కొత్తగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 540కి చేరాయి. ఇక రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.3 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 0.80 శాతంగా ఉంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com