భారత్ లో ఒక్కరోజే కరోనాతో 853 మంది మృతి
- August 02, 2020
భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో గత మూడు రోజులుగా ప్రతిరోజూ అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. తాజగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 11,45,630 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే కరోనా వల్ల కొత్తగా 853 మంది ప్రాణాలు కోల్పాయారు. కరోనా వైరస్ వల్ల ఒకేరోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు సంఖ్య 37,364కు చేరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?