తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు

- August 03, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 983 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 67,660కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా..48,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణలో 18,500 యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న కరోనాతో 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 551 మంది మృతి చెందారు. ఇంకా 1,414 రిపోర్టులకు సంబంధించిన ఫలితం తేలాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా GHMC-273, రంగారెడ్డి-73, కరీంనగర్-54, మేడ్చల్-48, పెద్దపల్లి-44, నిజామాబాద్-42, సంగారెడ్డి-37, నాగర్‌కర్నూలు-32 కేసులు నమోదయ్యాయి. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com