తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు
- August 03, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 67,660కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా..48,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో 18,500 యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న కరోనాతో 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 551 మంది మృతి చెందారు. ఇంకా 1,414 రిపోర్టులకు సంబంధించిన ఫలితం తేలాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా GHMC-273, రంగారెడ్డి-73, కరీంనగర్-54, మేడ్చల్-48, పెద్దపల్లి-44, నిజామాబాద్-42, సంగారెడ్డి-37, నాగర్కర్నూలు-32 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







