యూఏఈ నుంచి 275,000 మంది భారతీయులు స్వదేశానికి
- August 03, 2020
యూఏఈ:మే 7వ తేదీన రిపాట్రియేషన్ మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా యూఏఈ నుండి మొత్తంగా 275,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్ మిషన్ ఇన్ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,00,000 మంది భారతీయులు స్వదేశానికి వెళ్ళేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. గత కొద్ది వారాలుగా కొందరు భారతీయులు స్వదేశానికి వెళ్ళాల్సిన సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, టిక్కెట్లు పొందే విషయంలో వారికి సమస్యలు తలెత్తుతున్నాయని కాన్సులేట్ పేర్కొంది. అయితే, ఇప్పటికీ ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో అవసరమైన సీట్లు ఖాళీగా వున్నాయని చెప్పారు. ఆగస్ట్ 15 వరకు 90 విమానాలు అందుబాటులో వున్నాయనీ, వీటి ద్వారా కేరళ, ఢిల్లీ, గయ, వారణాసి, అమ్రిత్సర్, జైపూర్, హైదరాబాద్, త్రిచీ, చెన్నయ్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, మంగళూరు మరియు లక్నో తదిర నగరాలకు వెళ్ళేందుకు వీలుందని కాన్సులేట్ పేర్కొంది. మార్చి 1తో వీసా గడువు ముగిసిన విజిటర్స్ ఆగస్ట్ 10వ తేదీ లోపు దేశం విడిచి వెళ్ళాలనీ సూచించింది ఇండియన్ మిషన్.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







