యూఏఈ నుంచి 275,000 మంది భారతీయులు స్వదేశానికి
- August 03, 2020
యూఏఈ:మే 7వ తేదీన రిపాట్రియేషన్ మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా యూఏఈ నుండి మొత్తంగా 275,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్ మిషన్ ఇన్ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,00,000 మంది భారతీయులు స్వదేశానికి వెళ్ళేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. గత కొద్ది వారాలుగా కొందరు భారతీయులు స్వదేశానికి వెళ్ళాల్సిన సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, టిక్కెట్లు పొందే విషయంలో వారికి సమస్యలు తలెత్తుతున్నాయని కాన్సులేట్ పేర్కొంది. అయితే, ఇప్పటికీ ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో అవసరమైన సీట్లు ఖాళీగా వున్నాయని చెప్పారు. ఆగస్ట్ 15 వరకు 90 విమానాలు అందుబాటులో వున్నాయనీ, వీటి ద్వారా కేరళ, ఢిల్లీ, గయ, వారణాసి, అమ్రిత్సర్, జైపూర్, హైదరాబాద్, త్రిచీ, చెన్నయ్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, మంగళూరు మరియు లక్నో తదిర నగరాలకు వెళ్ళేందుకు వీలుందని కాన్సులేట్ పేర్కొంది. మార్చి 1తో వీసా గడువు ముగిసిన విజిటర్స్ ఆగస్ట్ 10వ తేదీ లోపు దేశం విడిచి వెళ్ళాలనీ సూచించింది ఇండియన్ మిషన్.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







