ఏ.పీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
- August 05, 2020
అమరావతి:ఏ.పీలో గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలను తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.నేడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. తాజాగా 60,576 శాంపిల్స్ పరీక్షించగా 10,128 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,86,461 కి చేరుకుంది.
ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 8,729 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తాజాగా కరోనా బారినపడి 77 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య నేటి వరకు 1681 కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,35,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1544 కొత్త కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో అత్యధికంగా నేటి వరకు 221 మంది మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?