కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు:ఈడీ అదుపులో ముగ్గురు కీలక నిందితులు
- August 05, 2020కేరళ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఏడు రోజుల పాటు విచారించేందుకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీకి వెళ్లిన వారిలో సరత్ పీఎస్, స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ఉన్నారు. కాగా ఇదే కేసులో నిందితులను ఈ నెల 21 వరకు జ్యుడీషియన్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. గత నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ దౌత్య సంబంధిత బ్యాగులో రూ.15 కోట్ల విలువైన బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్