ఏపీలో కొత్తగా 10,328 కరోనా కేసులు

- August 06, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 10,328  కరోనా కేసులు

అమరావతి:ఏ.పీ‌లో కోవిడ్ 19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,328 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గురువారం వెల్లడించింది.72మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,753కి చేరింది.

కరోనా వల్ల  గురువారం అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలులో 1285, అనంతపురంలో 1112 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 8516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 112870 కాగా, ప్రస్తుతం 82166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com