31 దేశాల ప్రయాణికులపై నిషేధాన్ని ప్రతి 10 రోజులకు సమీక్షించనున్న కువైట్
- August 06, 2020కువైట్ సిటీ:కరోనా ప్రభావంతో 31 దేశాల ప్రయాణిలపై నిషేధం విధించిన కువైట్ ప్రభుత్వం..తమ నిషేధ నిర్ణయంపై ప్రతి 10 రోజులకు ఓ సారి సమీక్షిస్తామని వెల్లడించింది. ఆయా దేశాల్లో కరోనా తీవ్రత, అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల ఆధారంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలను బట్టి నిషేధం సడిలింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయ సంస్థల నివేదిక ఆధారంగా నిషేధం విధించిన 31 దేశాల జాబితాను పెంచనూ వచ్చు..లేదంటే తగ్గించనూ వచ్చని కువైట్ వెల్లడించింది. అయితే..ఏయే దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించాలనేది నిర్ణయించేందుకు ఓ యంత్రగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. జడ్జిలు, డాక్టర్లు, నర్సులు, టీచర్లకు ప్రధాన్యత ఉంటుంది. ఇదిలాఉంటే..కువైట్ నుంచి భారత్ కు వెళ్లే ప్రయాణికులు అనుమతి ఇచ్చేలా ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించారు. ఈ మేరకు రోజు వెయ్యి మంది ప్రయాణికులు కువైట్ నుంచి భారత్ కు ప్రయాణించొచ్చు. అయితే..ప్రస్తుత నిబంధనల ప్రకారం మాత్రం కువైట్-భారత్ మధ్య విమాన ప్రయాణంపై నిషేధం అమలులో ఉంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్