ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మరిన్ని గల్ఫ్‌ విమానాలు

- February 06, 2016 , by Maagulf
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మరిన్ని గల్ఫ్‌ విమానాలు

 ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ త్వరలో దుబాయ్‌, షార్జాలకు ఢిల్లీ నుండి విమానాల్ని ప్రవేశపెట్టనుంది. మే నుంచి ఈ సర్వీసులు ముంబై టు గల్ఫ్‌ రీజియన్‌కి ప్రారంభమవుతాయి. రస్‌ అల్‌ ఖైమాకి కూడా కొత్త విమానాల్ని నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. రెండు కొత్త రూట్స్‌లో ఆరు కొత్త బోయింగ్‌ 737 ఎయిర్‌ క్రాఫ్ట్‌లను నడపనుంది ఈ సంస్థ. ఏప్రిల్‌ 7 నుంచి ముంబై టు దుబాయ్‌, షార్జాలకు విమానాల్ని నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. కేరళ నుంచి మిడిల్‌ ఈస్ట్‌కి ప్రస్తుతం నడుపుతున్న 96 సర్వీసుల సంఖ్యను 119కి పెంచాలన్నది సంస్థ లక్ష్యం. కోజికోడ్‌ నుంచి దుబాయ్‌కి నడుపుతున్న విమాన సర్వీసుల్ని డబుల్‌ చేయాలనే ఆలోచనలోనూ సంస్థ ఉంది. ఎయిర్‌లైన్స్‌ తమ న్యూ షెడ్యూల్‌లో భాగంగా కొచ్చి నుంచి దమ్మమ్‌ (సౌదీ అరేబియా), తిరువనంతపురం మరియు దుబాయ్‌లకు విస్తరించడం, అలాగే 930 ఉంచి 1116 సీట్లకు పెంచడం వంటి విషయాలతో దూసుకెళ్ళాలనుకుంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com