సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 2,50,000 మంది

- August 09, 2020 , by Maagulf
సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 2,50,000 మంది

రియాద్:సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు కింగ్ డమ్ లో కరోనా బారిన పడిన వారిలో 2,50,000 మంది కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు నిన్న కొత్తగా 1,492 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసులలో రియాద్ లో 101, మదినాలో 61, దమ్మమ్ లో 47, జాజమ్ లో 47 మంది ఉన్నారు. ఇదిలాఉంటే వైరస్ బారిన పడి మరో 37 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కింగ్ డమ్ పరిధిలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,130 మందికి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com