లాస్ట్ రైడ్ సేవలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్
- August 09, 2020
హైదరాబాద్:కోవిడ్-19 పేరు వింటనే 100 అడుగుల దూరం పరిగెత్తే పరిస్థితి. కానీ.. వైరస్ బారిన పడి మృతిచెందిన వారి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా నిర్వహించేందుకు ఫీడ్ ద నీడ్ సంస్థ ముందుకు వచ్చింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ వాహనాన్ని సీపీ మహేశ్ భగవత్ శనివారం ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చని.. 7995404040, 9490617234 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని ఈ సందర్భంగా కమీషనర్ తెలిపారు. ఈ వాహనంలో మృతదేహలను తరలించేందుకు అవసరమయ్యే 25 కిట్లను ఓ IT సంస్థ సమకూర్చింది. లాస్ట్రైడ్ సేవల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న 10 మంది సంస్థ ప్రతినిధులను కమీషనర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, రాచకొండ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సతీశ్, రాచకొండ అడ్మిన్ అదనపు డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







