లాస్ట్ రైడ్ సేవలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్
- August 09, 2020
హైదరాబాద్:కోవిడ్-19 పేరు వింటనే 100 అడుగుల దూరం పరిగెత్తే పరిస్థితి. కానీ.. వైరస్ బారిన పడి మృతిచెందిన వారి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా నిర్వహించేందుకు ఫీడ్ ద నీడ్ సంస్థ ముందుకు వచ్చింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ వాహనాన్ని సీపీ మహేశ్ భగవత్ శనివారం ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చని.. 7995404040, 9490617234 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని ఈ సందర్భంగా కమీషనర్ తెలిపారు. ఈ వాహనంలో మృతదేహలను తరలించేందుకు అవసరమయ్యే 25 కిట్లను ఓ IT సంస్థ సమకూర్చింది. లాస్ట్రైడ్ సేవల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న 10 మంది సంస్థ ప్రతినిధులను కమీషనర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, రాచకొండ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సతీశ్, రాచకొండ అడ్మిన్ అదనపు డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







