తెలంగాణ జాగృతి ఖతర్ హ్యండ్లూమ్ చాలెంజ్
- August 09, 2020
దోహా:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, స్వదేశీ చేనేత పరిశ్రమలకు కు అండగా నిలవాలన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశయాల మేరకు, ఆగస్ట్ 7న తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో హ్యండ్లూమ్ చాలెంజ్ ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ చేనేత స్రుజానాత్మకను, ఘన చరిత్ర కు దేశవిదేశాల్లో అవగాహ, ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశ్యం తో ఈ ఛాలెంజ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆగష్టు 7 నుండి 10 వరకు జరిగే హ్యండ్లూమ్ చాలెంజ్ విశేష స్పందన వచ్చిందని ఖతర్ తో పాటు యూకే, న్యూజిలాండ్, కువైట్ వంటి దేశాల నుండే కాకుండా భారత్ లో సైతం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు అతివలు చాలెంజ్ ను స్వీకరించి విజయవంతం చేసారని తెలిపారు.ఈ చాలెంజ్ లో పాల్గొన్న ఉత్తమ 10 మంది విజేతలకు సిరిసిల్ల చేనేత చీరలను బహుమతి గా ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదే సమయంలో చేనేతకు చేయూత ఇవ్యడానికి , భారత దేశానికే తలమానికంగా , తమ కళా సంపదను, నైపుణ్యాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన నేతన్నల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్డర్లు ఇవ్యనున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఈరోజు అగ్గి పెట్టె లో, చేతి వేలి ఉంగరం లో ఇమిడే చీరలను తయారు చేసిన సిరుల ఖిల్లా సిరిసిల్ల కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత చేనేత శిల్పి నల్ల పరంధాములు గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తన దైన నైపుణ్యం తో చేనేత వస్త్రాల తయారీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారి కుమారులు నల్ల విజయ్ ని తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రతినిధి ఎల్లయ్య తాళ్లపెళ్లి గారు సన్మానించి చేనేత వస్త్రాల ఎగుమతి కి ఆర్డర్ ఇవ్యడం జరిగింది.
ఈ సంధర్భంగా నందిని గారు మాట్లాడుతూ ఇతర దేశాల వస్తువులను వినియోగాన్ని సాధ్యమైన రీతిలో తగ్గించి మన సాంస్కృతి, వైభవాన్ని , కళాత్మక ను ప్రోత్సాహిస్తూ మన దేశపు వస్తువులు వాడితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి దొరుకుతుందని వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







