ఏపీలో కొత్తగా 10,820 కరోనా కేసులు నమోదు
- August 09, 2020
అమరావతి:ఏపీలో మరోసారి కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 62,912 శాంపిల్స్ ను పరీక్షించగా 10,820 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక కరోనా కారణంగా గుంటూరు లో పన్నెండు మంది, ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడప లో ఎనిమిది మంది, శ్రీకాకుళం లో ఎనిమిది మంది, కర్నూల్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, నెల్లూరు లో నలుగురు , విజయనగరం లో ముగ్గురు మరణించారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 9,097 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,24,965 పాజిటివ్ కేసు లకు గాను 1,35,817 మంది డిశ్చార్జ్ కాగా.. 2,036 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,112 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!