ఎలాంటి చెల్లుబాటయ్యే వీసా వున్నా యూఏఈకి ప్రయాణించొచ్చు
- August 11, 2020
యూఏఈ:భారత జాతీయులు చెల్లుబాటయ్యే ఎలాంటి యూఏఈ వీసా వున్నా, యూఏఈకి వెళ్ళవచ్చు. యూఏఈలో భారత రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. రాయబారి పవన్ కపూర్, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నోటిఫికేషన్ని ప్రస్తావిస్తూ, ఇండియా మరియు యూఏఈ ఎయిర్లైన్స్కి చెందిన విమానాలు భారత జాతీయుల్ని ఇండియా నుంచి యూఏఈకి ఏ తరహా వీసా వున్నా తరలిస్తాయని వివరించారు. గతంలో కేవలం రెసిడెన్సీ వీసా వున్నవారికి మాత్రమే యూఏఈకి వెళ్ళేందుకు (వందే భారత్ మిషన్ ద్వారా) అవకాశం వుండేది. యూఏఈ క్తొ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభించిన దరిమిలా, ఇండియాలోని సంబంధిత అథారిటీస్కి విజ్ఞప్తి చేయడం జరిగిందనీ, ఈ మేరకు సానుకూల నిర్ణయం వచ్చిందని చెప్పారు. ఇరు దేశాల మధ్య వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెండు దేశాలూ ఈ విషయమై సానుకూలంగా స్పందించాయి. కాగా, యూఏఈ రెసిడెన్సీ వీసాలు లేకపోవడంతో భారతదేశంలో వుండిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఇది వెసులుబాటు కల్పిస్తుందని యూఏఈలోని పలువురు భారతీయులు అభిప్రాయపడ్డారు. మార్చి నుంచి తాను, తన కుటుంబ సభ్యులతో ముంబైలో చిక్కుకుపోయాననీ, తాజా నిర్ణయంతో తమ కుటుంబానికి ఊరట దక్కుతోందని దుబాయ్ రెసిడెంట్ శ్రద్ధా సల్లా చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







