ఎట్టకేలకు కువైట్‌ నుంచి ఇండియాకి పయనమైన విమానం

- August 11, 2020 , by Maagulf
ఎట్టకేలకు కువైట్‌ నుంచి ఇండియాకి పయనమైన విమానం

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభం తర్వాత తొలిసారిగా కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియాకి 322 మందితో కూడిన విమానం బయల్దేరింది. ఢిల్లీకి ఈ విమానం బయల్దేరినట్లు అధికారులు వివరించారు. కాగా, విజయవాడతోపాటు చెన్నయ్‌, ముంబై, హైద్రాబాద్‌ అలాగే కొచ్చిన్‌ నగరాలకి రానున్న రోజుల్లో విమానాలు నడపనున్నారు. ఉదయం 10 గంటలకు కువైట్‌ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరడం ఆనందంగా వుందని అల్‌ తాయెర్‌ గ్రూప్‌ వెల్లడించింది. కాగా, జజీరా ఎయిర్‌ వేస్‌ ఓ విమానాన్ని విజయవాడ విమానాశ్రయానికి నడుపుతోంది. కాగా, ఇండియా నుంచి కువైట్‌కి ఎలాంటి షెడ్యూల్డ్‌ విమానాలూ నడపడంలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com