తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు

- August 12, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణాలో  కొత్తగా 1897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,897 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 84,544కు చేరింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 654కు పెరిగింది.

కరోనా నుంచి కొత్తగా 1920 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 61,294 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 15,534 మంది హోం ,ఇతర ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంటున్నారు.రికవరీ రేటు దేశంలో 69.79 శాతం ఉండగా, తెలంగాణలో 72.49 శాతంగా ఉంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com