ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల
- February 06, 2016
ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు చైర్ పర్సన్ యుథార్ అల్ రవాహి, ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అల్ రవాహి చెప్పారు. క్యాన్సర్ బాధితులకు తగిన సేవలందించేందుకు 180 మంది నర్స్లకు ఒమన్ పెట్రోల్ డెవలప్మెంట్తో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించామని ఆమె చెప్పారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ డాక్టర్లకూ శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందనీ, బ్రెస్డ్ క్యాన్సర్ కేసులు ఒమన్లో చాలా కామన్గా మారాయనీ, దాని తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారామె. 40 ఏళ్ళు పైబడిన మహిళలకు మామ్మోగ్రఫీ పరీక్షల్ని ఉచితంగా అవెన్యూ మాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ సేవలందించనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







