కోవిడ్-19 ఎఫెక్ట్: జీతాల కోసం ఆగస్ట్ 13 వరకల్లా రిజిస్టర్ చేసుకోవాలన్న కువైట్
- August 12, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభం నేపథ్యంలో జీతాల రూపంలో ప్రభుత్వం అందిస్తున్న సాయం కోసం ఈ నెల 13 వరకల్లా దరఖాస్తు చేసుకోవాలని కువైట్ వెల్లడించింది. కరోనా తర్వాతి పరిస్థితుల కారణంగా పలు రంగాల్లో ఉపాధి కొల్పోయిన వారికి ఆర్ధిక సాయం చేసేందుకు కువైట్ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'కువైట్ వితౌట్ శాలరీస్' కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఈ కమిటికి 4,726 దరఖాస్తులు అందినట్లు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా పలు కరాణాలతో జీతాలు అందకుంటే ఆగస్ట్ 13 నాటికి దరఖాస్తు చేస్తుకోవాలని సూచించింది. దరఖాస్తు స్వీకరణకు ఆన్ లైన్ విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అయితే..దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరెవరికి సాయం చేయాలనేది నిర్ధారించేందుకు కమిటీ పలు ప్రభుత్వ శాఖల అధికారులను సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







