మరో ఎంప్లాయర్ కోసం వలస కార్మికుల్ని వినియోగించడం నేరం
- August 13, 2020
మస్కట్: ఎంప్లాయర్స్, వలస కార్మికుల్ని మరో ఎంప్లాయర్ కోసం నియమిస్తే అది నేర పూరి తచర్య అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేరానికి పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష తప్పదని హెచ్చరించడం జరిగింది. ‘పౌరులు, నివాసితులకు హెచ్చరిక. వలస కార్మికుడ్ని వేరే ఎంప్లాయర్ దగ్గర పనిచేసేందుకు పంపితే అది శిక్షార్హమైన నేరం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జరీమానా, జైలు శిక్షలు ఆయా నేరాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి పెరుగుతుందని కూడా స్పష్టం చేశారు. సంబంధిత అథారిటీస్ నుంచి పర్మిట్ లేకుండా వలస కార్మికుడు తన యజమాని కాకుండా వేరొకరి దగ్గర పనిచేస్తే 800 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్షతోపాటు డిపోర్టేషన్ కూడా చేస్తారు.
తాజా వార్తలు
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!









