మరో ఎంప్లాయర్ కోసం వలస కార్మికుల్ని వినియోగించడం నేరం
- August 13, 2020
మస్కట్: ఎంప్లాయర్స్, వలస కార్మికుల్ని మరో ఎంప్లాయర్ కోసం నియమిస్తే అది నేర పూరి తచర్య అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేరానికి పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష తప్పదని హెచ్చరించడం జరిగింది. ‘పౌరులు, నివాసితులకు హెచ్చరిక. వలస కార్మికుడ్ని వేరే ఎంప్లాయర్ దగ్గర పనిచేసేందుకు పంపితే అది శిక్షార్హమైన నేరం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జరీమానా, జైలు శిక్షలు ఆయా నేరాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి పెరుగుతుందని కూడా స్పష్టం చేశారు. సంబంధిత అథారిటీస్ నుంచి పర్మిట్ లేకుండా వలస కార్మికుడు తన యజమాని కాకుండా వేరొకరి దగ్గర పనిచేస్తే 800 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్షతోపాటు డిపోర్టేషన్ కూడా చేస్తారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







