మరో ఎంప్లాయర్ కోసం వలస కార్మికుల్ని వినియోగించడం నేరం
- August 13, 2020
మస్కట్: ఎంప్లాయర్స్, వలస కార్మికుల్ని మరో ఎంప్లాయర్ కోసం నియమిస్తే అది నేర పూరి తచర్య అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేరానికి పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష తప్పదని హెచ్చరించడం జరిగింది. ‘పౌరులు, నివాసితులకు హెచ్చరిక. వలస కార్మికుడ్ని వేరే ఎంప్లాయర్ దగ్గర పనిచేసేందుకు పంపితే అది శిక్షార్హమైన నేరం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జరీమానా, జైలు శిక్షలు ఆయా నేరాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి పెరుగుతుందని కూడా స్పష్టం చేశారు. సంబంధిత అథారిటీస్ నుంచి పర్మిట్ లేకుండా వలస కార్మికుడు తన యజమాని కాకుండా వేరొకరి దగ్గర పనిచేస్తే 800 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్షతోపాటు డిపోర్టేషన్ కూడా చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







