యూఏఈ కి తిరిగొచ్చే ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
- August 13, 2020
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ) యూఏఈ, దేశంలోకి తిరిగొచ్చేవారందరికీ 14 రోజుల క్వారంటైన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ తేలినా 14 రోజులు క్వారంటైన్లోనే వుండాల్సి వస్తుంది. తక్కువ రిస్క్ వున్న దేశాల నుంచి వచ్చే కొందరు ప్రొఫెషనల్స్కి మాత్రం పరిస్థితుల్ని బట్టి క్వారంటైన్ గడువుని వారం రోజులకు పరిమితం చేయనున్నారు. పబ్లిక్ హెల్త్ని కాపాడే క్రమంలో ఖచ్చితమైన రీతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రికాషనరీ మెజర్స్ని తప్పక అమలు చేయాల్సిందేనని అంటున్నారు అదికారులు. ‘ప్యూర్ హెల్త్ డాట్ ఎఇ’ అనే వెబ్సైట్ ద్వారా కరోనా వైరస్ టెస్టులకు సంబంధించిన ల్యాబ్ల వివరాలు అందుబాటులో వుంటాయనీ, వాటి నుంచి ప్రయాణానికి 96 గంటల లోపల కరోనా టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ తెచ్చుకున్నవారినే ప్రయాణానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- బహ్రెయిన్ లో నిఘా, గస్తీతో చోరీలకు చెక్..!!









