యూఏఈ కి తిరిగొచ్చే ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
- August 13, 2020
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ) యూఏఈ, దేశంలోకి తిరిగొచ్చేవారందరికీ 14 రోజుల క్వారంటైన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ తేలినా 14 రోజులు క్వారంటైన్లోనే వుండాల్సి వస్తుంది. తక్కువ రిస్క్ వున్న దేశాల నుంచి వచ్చే కొందరు ప్రొఫెషనల్స్కి మాత్రం పరిస్థితుల్ని బట్టి క్వారంటైన్ గడువుని వారం రోజులకు పరిమితం చేయనున్నారు. పబ్లిక్ హెల్త్ని కాపాడే క్రమంలో ఖచ్చితమైన రీతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రికాషనరీ మెజర్స్ని తప్పక అమలు చేయాల్సిందేనని అంటున్నారు అదికారులు. ‘ప్యూర్ హెల్త్ డాట్ ఎఇ’ అనే వెబ్సైట్ ద్వారా కరోనా వైరస్ టెస్టులకు సంబంధించిన ల్యాబ్ల వివరాలు అందుబాటులో వుంటాయనీ, వాటి నుంచి ప్రయాణానికి 96 గంటల లోపల కరోనా టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ తెచ్చుకున్నవారినే ప్రయాణానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







