యూఏఈ కి తిరిగొచ్చే ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
- August 13, 2020
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ) యూఏఈ, దేశంలోకి తిరిగొచ్చేవారందరికీ 14 రోజుల క్వారంటైన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ తేలినా 14 రోజులు క్వారంటైన్లోనే వుండాల్సి వస్తుంది. తక్కువ రిస్క్ వున్న దేశాల నుంచి వచ్చే కొందరు ప్రొఫెషనల్స్కి మాత్రం పరిస్థితుల్ని బట్టి క్వారంటైన్ గడువుని వారం రోజులకు పరిమితం చేయనున్నారు. పబ్లిక్ హెల్త్ని కాపాడే క్రమంలో ఖచ్చితమైన రీతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రికాషనరీ మెజర్స్ని తప్పక అమలు చేయాల్సిందేనని అంటున్నారు అదికారులు. ‘ప్యూర్ హెల్త్ డాట్ ఎఇ’ అనే వెబ్సైట్ ద్వారా కరోనా వైరస్ టెస్టులకు సంబంధించిన ల్యాబ్ల వివరాలు అందుబాటులో వుంటాయనీ, వాటి నుంచి ప్రయాణానికి 96 గంటల లోపల కరోనా టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ తెచ్చుకున్నవారినే ప్రయాణానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







