సమాజానికి కొత్త మెసేజ్ ఇచ్చే 'సైకో'
- August 14, 2020
లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బానర్ పై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సైకో'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ సాయి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మిస్ కాకుండా రిచ్ గా సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే ఓ కొత్త పాయింట్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుందని, ఈ చిత్రం సమాజానికి ఓ కొత్త మెసేజ్ ఇస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలమని చిత్ర దర్శకుడు కార్తీక్ సాయి అంటున్నారు.
ఈ 'సైకో' చిత్రంలో హీరోగా కార్తీక్ సాయి, ఫిమేల్ లీడ్ రోల్స్ లో డాలి షా, నేహా దేశ్ పాండే నటిస్తుండగా..సీవిఎల్ నరసింహ, సంధ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ గా ఆర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ గా సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్ గా ప్రియా, సంతోష్ కుమార్ పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







