తెలంగాణలో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- August 16, 2020 , by Maagulf
తెలంగాణలో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణలో శనివారం ఒక్కరోజే 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91,361కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 693కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,542కి చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన్న 1,930 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68,126కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా GHMC పరిధిలో కొత్తగా 234, కరీంనగర్ లో 101, రంగారెడ్డి జిల్లాలో 81, మేడ్చల్ లో 63, సంగారెడ్డిలో 66 కేసులు నమోదయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com