సౌదీ:వచ్చే వారం నుంచి విధులకు హజరవనున్న టీచర్లు
- August 16, 2020
రియాద్:కోవిడ్ సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవన ప్రక్రియను ప్రారంభించిన సౌదీ అరేబియా ప్రభుత్వం..ఇక స్కూల్స్ పై ఫోకస్ చేసింది. పకడ్బందీ ముందస్తు జాగ్రత్త చర్యలతో ఆగస్ట్ 30 నుంచే విద్యా వార్షిక సంవత్సరాన్ని ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు లక్షా 14 వేల విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు వచ్చే వారం నుంచి విధులకు హజరుకాబోతున్నారు. అయితే..కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధులకు పాఠాలు ఎలా బోధిస్తారనేది చాలా మంది తల్లిదండ్రుల్లో ఆవేదన నెలకొని ఉంది. అలాగే ఆగస్ట్ 30 నుంచి అకాడమిక్ ఇయర్
ప్రారంభం అయినా...పాఠాలు ఆన్ లైన్ ద్వారా బోధిస్తారా, క్లాస్ రూమ్స్ లోనే క్లాసెస్ తీసుకుంటారా...లేదంటే రెండు విధానాలు అనుసరిస్తారా అనేది కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొని ఉంది. బోధన విధనం ఇప్పటి వరకైతే స్పష్టత లేకున్నా...అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులను వైరస్ బారి నుంచి రక్షించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ స్కూల్ నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల అమలు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







