సౌదీ:వచ్చే వారం నుంచి విధులకు హజరవనున్న టీచర్లు
- August 16, 2020
రియాద్:కోవిడ్ సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవన ప్రక్రియను ప్రారంభించిన సౌదీ అరేబియా ప్రభుత్వం..ఇక స్కూల్స్ పై ఫోకస్ చేసింది. పకడ్బందీ ముందస్తు జాగ్రత్త చర్యలతో ఆగస్ట్ 30 నుంచే విద్యా వార్షిక సంవత్సరాన్ని ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు లక్షా 14 వేల విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు వచ్చే వారం నుంచి విధులకు హజరుకాబోతున్నారు. అయితే..కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధులకు పాఠాలు ఎలా బోధిస్తారనేది చాలా మంది తల్లిదండ్రుల్లో ఆవేదన నెలకొని ఉంది. అలాగే ఆగస్ట్ 30 నుంచి అకాడమిక్ ఇయర్
ప్రారంభం అయినా...పాఠాలు ఆన్ లైన్ ద్వారా బోధిస్తారా, క్లాస్ రూమ్స్ లోనే క్లాసెస్ తీసుకుంటారా...లేదంటే రెండు విధానాలు అనుసరిస్తారా అనేది కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొని ఉంది. బోధన విధనం ఇప్పటి వరకైతే స్పష్టత లేకున్నా...అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులను వైరస్ బారి నుంచి రక్షించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ స్కూల్ నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల అమలు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.
తాజా వార్తలు
- 'ఇన్నర్ టెంపుల్' గౌరవ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
- బహ్రెయిన్లో ప్రమాదానికి గురైన భారతీయ మహిళ స్వదేశానికి తరలింపు
- ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)









