సౌదీ:వచ్చే వారం నుంచి విధులకు హజరవనున్న టీచర్లు
- August 16, 2020
రియాద్:కోవిడ్ సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవన ప్రక్రియను ప్రారంభించిన సౌదీ అరేబియా ప్రభుత్వం..ఇక స్కూల్స్ పై ఫోకస్ చేసింది. పకడ్బందీ ముందస్తు జాగ్రత్త చర్యలతో ఆగస్ట్ 30 నుంచే విద్యా వార్షిక సంవత్సరాన్ని ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు లక్షా 14 వేల విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు వచ్చే వారం నుంచి విధులకు హజరుకాబోతున్నారు. అయితే..కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధులకు పాఠాలు ఎలా బోధిస్తారనేది చాలా మంది తల్లిదండ్రుల్లో ఆవేదన నెలకొని ఉంది. అలాగే ఆగస్ట్ 30 నుంచి అకాడమిక్ ఇయర్
ప్రారంభం అయినా...పాఠాలు ఆన్ లైన్ ద్వారా బోధిస్తారా, క్లాస్ రూమ్స్ లోనే క్లాసెస్ తీసుకుంటారా...లేదంటే రెండు విధానాలు అనుసరిస్తారా అనేది కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొని ఉంది. బోధన విధనం ఇప్పటి వరకైతే స్పష్టత లేకున్నా...అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులను వైరస్ బారి నుంచి రక్షించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ స్కూల్ నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల అమలు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?