ఏపీలో భారీగా కరోనా కేసులు

- August 18, 2020 , by Maagulf
ఏపీలో భారీగా కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. తాజా బులిటెన్ ప్రకారం... ఏపీలో 3 లక్షలు దాటాయి కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06, 261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85130 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29,61,611 టెస్ట్‌లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com