విజిటర్స్‌ విడిచి వెళ్ళాల్సిందే

- August 19, 2020 , by Maagulf
విజిటర్స్‌ విడిచి వెళ్ళాల్సిందే

కువైట్ సిటీ:అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్యామిలీ రెసిడెన్స్‌కి సంబంధించి విజిట్‌ వీసా ట్రాన్స్‌ఫర్‌కి వీలు లేకుండా సంబంధిత అథారిటీస్‌కి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ క్రైసిస్‌ తర్వాత దేశానికి విజిట్‌ వీసాపై వచ్చినవారికి ఫ్యామిలీ రెసిడెన్స్‌ వీసా కింద ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలు లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. విజిట్‌ వీసాపై వచ్చినవారు వెంటనే దేశం విడిచి వెళ్ళాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ అధికారిక వర్గాలు హెచ్చరించాయి. కాగా, ఆగస్ట్‌ 31 వరకు అథారిటీస్‌ విజిట్‌ వీసా గడువుని పొడిగించాయి. కాగా, వీసాలు తదుపరి పొడిగింపుకి ఆస్కారం లేదనీ, ఫ్యామిలీ రెసిడెన్స్‌గా కన్‌వర్ట్‌ చేయడానికీ వీలుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com