యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- September 16, 2025
యూఏఈ: 35 ఏళ్ల ఇరాకీ ప్రవాసి అలీ నిహాద్ అబ్దులతీఫ్ అల్ తయ్యర్ ను Dh1 మిలియన్ యూఏఈ లాటరీ వరించింది. ఇది మాటలకు అందని అనుభూతి అని అతను అన్నాడు. గత కొంత కాలంగా తాను అనుభవించిన కష్టాలను సెప్టెంబర్ 6 డ్రా దూరం చేస్తుందన్నారు. లాటరీ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కూతురు పుట్టిన రోజు, మరియు తన తండ్రి పుట్టిన రోజు కాంబినేషన్ లో ఎంచుకున్న 5, 11, 14 నంబర్లు తన తలరాతను మార్చాయని తెలిపాడు.
ఐదు సంవత్సరాలుగా యూఏలో నివసిస్తున్న అలీ, అజ్మాన్లో వాజే అల్ జమాల్ పెర్ఫ్యూమ్స్ & కాస్మెటిక్ ట్రేడింగ్ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రెండు వారాలకు తన భార్యతో కలిసి టిక్కెట్లు కొంటానని, అందుకోసం 200 దిర్హమ్స్ ను కేటాయిస్తానని వివరించాడు.
గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైన యూఏఈ లాటరీ 100 నుండి 100 మిలియన్ల దిర్హమ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







