యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- September 16, 2025
యూఏఈ: 35 ఏళ్ల ఇరాకీ ప్రవాసి అలీ నిహాద్ అబ్దులతీఫ్ అల్ తయ్యర్ ను Dh1 మిలియన్ యూఏఈ లాటరీ వరించింది. ఇది మాటలకు అందని అనుభూతి అని అతను అన్నాడు. గత కొంత కాలంగా తాను అనుభవించిన కష్టాలను సెప్టెంబర్ 6 డ్రా దూరం చేస్తుందన్నారు. లాటరీ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కూతురు పుట్టిన రోజు, మరియు తన తండ్రి పుట్టిన రోజు కాంబినేషన్ లో ఎంచుకున్న 5, 11, 14 నంబర్లు తన తలరాతను మార్చాయని తెలిపాడు.
ఐదు సంవత్సరాలుగా యూఏలో నివసిస్తున్న అలీ, అజ్మాన్లో వాజే అల్ జమాల్ పెర్ఫ్యూమ్స్ & కాస్మెటిక్ ట్రేడింగ్ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రెండు వారాలకు తన భార్యతో కలిసి టిక్కెట్లు కొంటానని, అందుకోసం 200 దిర్హమ్స్ ను కేటాయిస్తానని వివరించాడు.
గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైన యూఏఈ లాటరీ 100 నుండి 100 మిలియన్ల దిర్హమ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







