యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- September 16, 2025
యూఏఈ: 35 ఏళ్ల ఇరాకీ ప్రవాసి అలీ నిహాద్ అబ్దులతీఫ్ అల్ తయ్యర్ ను Dh1 మిలియన్ యూఏఈ లాటరీ వరించింది. ఇది మాటలకు అందని అనుభూతి అని అతను అన్నాడు. గత కొంత కాలంగా తాను అనుభవించిన కష్టాలను సెప్టెంబర్ 6 డ్రా దూరం చేస్తుందన్నారు. లాటరీ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కూతురు పుట్టిన రోజు, మరియు తన తండ్రి పుట్టిన రోజు కాంబినేషన్ లో ఎంచుకున్న 5, 11, 14 నంబర్లు తన తలరాతను మార్చాయని తెలిపాడు.
ఐదు సంవత్సరాలుగా యూఏలో నివసిస్తున్న అలీ, అజ్మాన్లో వాజే అల్ జమాల్ పెర్ఫ్యూమ్స్ & కాస్మెటిక్ ట్రేడింగ్ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రెండు వారాలకు తన భార్యతో కలిసి టిక్కెట్లు కొంటానని, అందుకోసం 200 దిర్హమ్స్ ను కేటాయిస్తానని వివరించాడు.
గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైన యూఏఈ లాటరీ 100 నుండి 100 మిలియన్ల దిర్హమ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







