ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక..
- August 20, 2020
యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం ఇప్పటికే టీంలు అక్కడికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ జట్లు, సిబ్బంది ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో దుబాయ్కి చేరుకున్నారు. అయితే టోర్నీ సందర్భంగా బీసీసీఐ ప్లేయర్లకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హెచ్చరికలు జారీ చేసింది.
కోవిడ్ 19 రూల్స్ ను ఫ్రాంచైజీలు, ప్లేయర్లు బ్రేక్ చేయకూడదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి హెచ్చరించారు. దుబాయ్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లేయర్లు, సిబ్బంది తిరగకూడదని, కచ్చితమైన నిబంధనలను పాటించాలని అన్నారు. బయో సెక్యూర్ బబుల్ను వీడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది, ఓనర్లు, ఇతర సిబ్బంది కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
కాగా ఇటీవల ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఓ టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ బబుల్ రూల్ను బ్రేక్ చేశాడు. దీంతో అతన్ని తరువాత టెస్టు నుంచి తప్పించారు. అందువల్ల ప్లేయర్లు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవలం ఒక్కరు బయటకు వెళ్లి తిరిగి వచ్చినా అది ఆ టీం మొత్తానికీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని, కనుక అందరూ జాగ్రత్తలను పాటించాలని బీసీసీఐ సూచించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!