వినాయక చవతి పండగను పర్యావణ హితంగా ఇండ్లలోనే జరుపుకోవాలి-మేయర్ బొంతు రామ్మోహన్
- August 20, 2020
హైదరాబాద్:కోవిడ్ -19 కారణంగా వినాయక చవతి పండగను పర్యావరణ హితంగా ఇండ్లలోనే జరుపుకోవాలని నగర ప్రజలకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు*. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ స్వప్న, కార్పొరేటర్ మమత, శాటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్, హెచ్.ఎం.డి.ఏ ఎస్.ఇ పరంజ్యోతిలతో కలిసి జిహెచ్ఎంసి ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మట్టి వినాయక విగ్రహాలను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించుటలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జిహెచ్ఎంసి ద్వారా 50వేలు, హెచ్.ఎం.డి.ఏ ద్వారా మరో 50వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో జిహెచ్ఎంసి కార్పొరేటర్ల ద్వారా అన్ని వార్డులలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్.ఎం.డి.ఏ ద్వారా నిర్దేశించిన కేంద్రాలతో పాటు మొబైల్ వాహనాల ద్వారా కూడా కాలనీలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









