వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ శుభాకాంక్షలు

- August 22, 2020 , by Maagulf
వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ శుభాకాంక్షలు

హైదరాబాద్:నేడు వినాయ‌క చ‌తుర్థి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తొంద‌ర‌లోనే కరోనా వైర‌స్‌ మహమ్మారి నుంచి విముక్తి లభించి రాష్ట్ర, దేశ ప్రజలందరు సాధారణ జీవన పరిస్థితులకు వచ్చేలా చూడాలని వినాయకుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.గవర్నర్ రాజ్ భవన్ సిబ్బందికి మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేశారు

కాగా, క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సుప్రీం కోర్టు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే పండుగ జ‌రుపుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com