దోహా:అభివృద్ధి పనులతో 6 నెలల పాటు లులు కూడలి పాక్షికంగా మూసివేత
- August 23, 2020
దోహా:డీ రింగ్ రోడ్డులో భాగమైన లులు జంక్షన్ ను 6 నెలల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. డీ రింగ్ రోడ్డును ట్రాఫిక్ ఫ్లోకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నందున ఈ అంతరాయం అనివార్యంగా మారిందని వివరించింది. లులు కూడలిలో ఈ నెల 23 నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని..ఈ మేరకు మార్పులను వాహనదారులు గమనించాలని కోరింది. అభివృద్ధి పనుల సమయంలో వాహనాలు వెళ్లాల్సిన దారులకు సంబంధించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులో సూచనలు చేశామని, సూచించిన డైరక్షన్ లో వాహనాలు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే..మౌళిక సదుపాయల అభివృద్ధిలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ అష్గల్ డీ రింగ్ డెవలప్మెంట్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!