దుబాయ్ చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం

- August 23, 2020 , by Maagulf
దుబాయ్ చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం

దుబాయ్:సెప్టెంబర్‌19న IPL ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం కాస్త ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈ చేరుకున్నాయి.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.IPL‌ నిర్వహణకు BCCI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌,రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు దుబాయ్‌,అబుధాబి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com