హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ
- August 25, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ 'ఫ్రీ హింట్ ఫాంటసీ' తమ వ్యాపార విస్తరణకు రూ.4 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ అభివృద్ధికి వినియోగించి 2021 నాటికి 10 మిలియన్ల మంది వినియోగదారులను చేరువయ్యేలా వినియోగించనుంది. ఫ్రీ హింట్ ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ ఈ నెల 30 నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే.. దేశంలోనే తొలిసారిగా కేవలం ఒక్క రూపాయితోనే ఖచ్చితమైన బహుమతులు గెలుచుకునేలా ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ వినియోగదారులను ఆకర్షించనుంది. పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్రస్తుతానికి 8 భాషలలో అప్లికేషన్ రూపొందించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష్ చౌదరి, తరుణ్ వర్మ దండు, రమణ కొవెలముడి ఫ్రీ హింట్ ఫాంటసీని స్థాపించారు. ఓ గేమింగ్ అప్లికేషన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా నిధులు సమీకరించిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. అయితే..2023 నాటికి గేమింగ్ కంపెనీ 119 బిలియన్ల మార్కెట్ కు ఎదుగుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







