హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ
- August 25, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ 'ఫ్రీ హింట్ ఫాంటసీ' తమ వ్యాపార విస్తరణకు రూ.4 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ అభివృద్ధికి వినియోగించి 2021 నాటికి 10 మిలియన్ల మంది వినియోగదారులను చేరువయ్యేలా వినియోగించనుంది. ఫ్రీ హింట్ ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ ఈ నెల 30 నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే.. దేశంలోనే తొలిసారిగా కేవలం ఒక్క రూపాయితోనే ఖచ్చితమైన బహుమతులు గెలుచుకునేలా ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ వినియోగదారులను ఆకర్షించనుంది. పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్రస్తుతానికి 8 భాషలలో అప్లికేషన్ రూపొందించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష్ చౌదరి, తరుణ్ వర్మ దండు, రమణ కొవెలముడి ఫ్రీ హింట్ ఫాంటసీని స్థాపించారు. ఓ గేమింగ్ అప్లికేషన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా నిధులు సమీకరించిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. అయితే..2023 నాటికి గేమింగ్ కంపెనీ 119 బిలియన్ల మార్కెట్ కు ఎదుగుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







