హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ

- August 25, 2020 , by Maagulf
హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ 'ఫ్రీ హింట్ ఫాంటసీ' తమ వ్యాపార విస్తరణకు రూ.4 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ అభివృద్ధికి వినియోగించి 2021 నాటికి 10 మిలియన్ల మంది వినియోగదారులను చేరువయ్యేలా వినియోగించనుంది. ఫ్రీ హింట్ ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ ఈ నెల 30 నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే.. దేశంలోనే తొలిసారిగా కేవలం ఒక్క రూపాయితోనే ఖచ్చితమైన బహుమతులు గెలుచుకునేలా ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ వినియోగదారులను ఆకర్షించనుంది. పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్రస్తుతానికి 8 భాషలలో అప్లికేషన్ రూపొందించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష్ చౌదరి, తరుణ్ వర్మ దండు, రమణ కొవెలముడి ఫ్రీ హింట్ ఫాంటసీని స్థాపించారు. ఓ గేమింగ్ అప్లికేషన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా నిధులు సమీకరించిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. అయితే..2023 నాటికి గేమింగ్ కంపెనీ 119 బిలియన్ల మార్కెట్ కు ఎదుగుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com