ఒమాన్ లో అత్యవసర మార్గం మీద వాహనాన్ని నడిపిస్తే వారికి... ఏ శిక్ష విధించాలి ??
- February 08, 2016
ఒమాన్ లో అత్యవసర మార్గం మీద వాహనాన్ని నడిపినవారిని 48 గంటల పాటు నిర్బంధించి తర్వాత చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచిస్తామని రాయల్ ఒమాన్ పోలీస్ వాహనదారులను హెచ్చరిస్తూ ట్విట్ చేసింది. ఒమన్లో ప్రధాన రహదారిలో ఒక అత్యవసర మార్గం ఎపుడూ కొనసాగుతూ ఉంటుందని , అంబులెన్సు వంటి అత్యవసర వాహనాల కోసం అవి కేటాయించినివని పలువురు గ్రహించడం లేదని పేర్కొన్నారు. కొందఱు వాహనదారులు ట్రాఫిక్ రద్దీ నుంచి సులువుగా తప్పుకొనేందుకు ఈ అత్యవసర మార్గాన్ని ఎంచుకోవడం ట్రాఫిక్ ఉల్లంఘన నేరంగా కింద పరిగణించాల్సివస్తుందని పేర్కొన్నారు. ఒమాన్ పోలీసులు ట్విట్ చేసిన సూచన సామాజిక మాధ్యమంలో పలువురు స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓపికతో తమకు నిర్దేశించబడిన దారిలోనే ప్రయాణిస్తే, అనవసర్ ట్రాఫిక్ రద్ది తగ్గడమే కాక పలు రోడ్డు ప్రమాదాలను నివారించ గలుగుతామని తెలిపారు. వాహనదారులలో ఎక్కువమంది తాము మాత్రమె బిజీ అని, తమ సమయం మాత్రమె అమోల్యమైనధన్నట్లు ప్రవర్తిస్తారని పేర్కొంటూ, వారికే ఈ సందర్భంగా ఒక సలహా ఇచ్చేరు. కొంతమంది వేగంగా గమ్యానికి చేరాల్సిన అవసరం ఉండవచ్చని, తాము ( పోలీస్ ) పట్టుకొన్న తర్వాత వారి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలను చూపితే, వారిని ట్రాఫిక్ కేసు నుంచి కొంత ఉపసమనం పొందే అవకాశం ఇవ్వనున్నట్లు రాయల్ ఒమాన్ పోలీస్ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







