అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందే:సౌదీ
- August 26, 2020
రియాద్:జాతీయ పతాకానికి సంబంధించి సౌదీ ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ అధికారిక భవనాలపై సౌదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించింది. పవిత్ర మక్కా గవర్నర్, రాయల్ సలహాదారుడు ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైసల్ ఈ మేరకు మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బిల్డింగ్ లపై వారంలో ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఈ కొత్త మార్గనిర్దేకాల సారాంశం. సౌదీ జాతీయ పతాక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం బిల్డింగ్ పై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి. కానీ, యువరాజు ఖలేద్ తన పరిశీలనలో చాలావరకు కార్యాలయాలు ఈ నిబంధనలను పట్టించుకోలేదని నిర్ధారించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజు ఇక నుంచి ప్రతి కార్యాలయ భవనాలపై సౌదీ జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఆదేశించారు. అంతేకాదు..ప్రతి కార్యాలయంపై జాతీయ పతాకం విధానం అమలు ఆదేశాలను యువరాజు స్వయంగా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







