అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందే:సౌదీ
- August 26, 2020
రియాద్:జాతీయ పతాకానికి సంబంధించి సౌదీ ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ అధికారిక భవనాలపై సౌదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించింది. పవిత్ర మక్కా గవర్నర్, రాయల్ సలహాదారుడు ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైసల్ ఈ మేరకు మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బిల్డింగ్ లపై వారంలో ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఈ కొత్త మార్గనిర్దేకాల సారాంశం. సౌదీ జాతీయ పతాక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం బిల్డింగ్ పై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి. కానీ, యువరాజు ఖలేద్ తన పరిశీలనలో చాలావరకు కార్యాలయాలు ఈ నిబంధనలను పట్టించుకోలేదని నిర్ధారించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజు ఇక నుంచి ప్రతి కార్యాలయ భవనాలపై సౌదీ జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఆదేశించారు. అంతేకాదు..ప్రతి కార్యాలయంపై జాతీయ పతాకం విధానం అమలు ఆదేశాలను యువరాజు స్వయంగా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







