అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందే:సౌదీ
- August 26, 2020
రియాద్:జాతీయ పతాకానికి సంబంధించి సౌదీ ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ అధికారిక భవనాలపై సౌదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించింది. పవిత్ర మక్కా గవర్నర్, రాయల్ సలహాదారుడు ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైసల్ ఈ మేరకు మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బిల్డింగ్ లపై వారంలో ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఈ కొత్త మార్గనిర్దేకాల సారాంశం. సౌదీ జాతీయ పతాక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం బిల్డింగ్ పై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి. కానీ, యువరాజు ఖలేద్ తన పరిశీలనలో చాలావరకు కార్యాలయాలు ఈ నిబంధనలను పట్టించుకోలేదని నిర్ధారించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజు ఇక నుంచి ప్రతి కార్యాలయ భవనాలపై సౌదీ జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఆదేశించారు. అంతేకాదు..ప్రతి కార్యాలయంపై జాతీయ పతాకం విధానం అమలు ఆదేశాలను యువరాజు స్వయంగా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







